NotesWhat is notes.io?

Notes brand slogan

Notes - notes.io

భారతదేశానికి జాతిపిత ఎవరు అంటే చాలా మంది భారతీయులు 'గాంధీ' అని చెప్తారు.
కానీ గాంధీకి "జాతిపిత" అనే శీర్షిక భారత ప్రభుత్వం అధికారికంగా ఇవ్వలేదు అని ఎంత మందికి తెలుసు!
ఫిబ్రవరి 2012 లో లక్నోకు చెందిన పదేళ్ల బాలిక దాఖలు చేసిన ఆర్టీఐ ప్రశ్నకి సమాధానం ఇస్తూ, ప్రభుత్వం తమ దగ్గర ఈ విషయానికి సంబంధించి ఎటువంటి రికార్డులు లేవని చెప్పింది. అంతే కాదు ప్రస్తుతం గాంధీని జాతిపితగా అధికారికంగా ప్రకటించే వీలు కూడా లేదని స్పష్టం చేసింది. భారత రాజ్యాంగం ప్రకారం, విద్యా మరియు సైనిక శీర్షికలు తప్ప మరే శీర్షికలను అనుమతించనందున గాంధీకి భారత ప్రభుత్వం బిరుదు ఇవ్వలేమని MHA తెలియజేసింది.

ప్రపంచంలో, పులులు మరియు సింహాలు, ఈ రెండిటినీ కలిగిన ఏకైక దేశం- భారతదేశం.

ప్రపంచంలో రెండు వేర్వేరు దేశాలకు జాతీయ గీతాలు రాసిన ఏకైక వ్యక్తి భారతీయుడు.
ఆయనే రవీంద్రనాథ్ ఠాగూర్. భారతదేశానికి జాతీయ గీతం జనగణమణ, బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనార్ బంగ్లా రాశారు.

బెర్నౌలి సిద్ధాంతం, పాస్కల్ సిద్దాంతం- ఇలా ఆయా శాస్త్రవేత్తల పేర్లతో సిద్ధాంతాలని, ప్రమాణాల్ని చదువుకున్నపుడు చాలా మంది భారతీయులకి, భారతీయ శాస్త్రవేత్తల పేర్లతో కూడా సిద్ధాంతాల నామకరణం జరిగిందని తెలియదు. ఉదాహరణకి
శ్రీనివాస రామానుజన్- రామానుజన్ కంజెక్చర్, రామానుజన్ ప్రైమ్, రామానుజన్ మాస్టర్ థీరం
పి.సి. మహలనోబిస్- మహలనోబిస్ డిస్టెన్స్, మహలనోబిస్ మోడల్
ఎస్. చంద్రశేఖర్ - చంద్రశేఖర్ లిమిట్, చంద్రశేఖర్ టెన్సర్, చంద్రశేఖర్స్ హెచ్- ఫంక్షన్
సి వి రామన్- రామన్ ఎఫెక్ట్
సత్యేంద్రనాథ్ బోస్- బోస్ గ్యాస్, బోసాన్, బోస్-ఐన్ స్టీన్ కండెన్సేట్

గల్ఫ్ దేశాల కరెన్సీ ఏంటి? చాల మంది దిర్హామ్ములు అని సరిగ్గానే చెప్తారు. కానీ 1960కు ముందు గల్ఫ్ దేశాల కరెన్సీ భారతీయ రూపీ అని చాల మందికి తెలియకపోవచ్చు. కానీ గల్ఫ్ దేశాల నుండి భారత దేశంలోకి బంగారం స్మగ్గ్లింగ్ పెరగడంతో, విదేశీ మారక నిల్వలు క్షీణతను అడ్డుకోవటానికి 1959లో రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా 'గల్ఫ్ రూపీ' ని ప్రత్యేకంగా గల్ఫ్ దేశాల్లో చలామణి కోసం ముద్రించి, భారతీయ రూపీని గల్ఫ్ రూపీగా మార్చుకోవడానికి 6 వారాల గడువు విధించి, ఈ ప్రయత్నంలో సఫలం అయ్యింది. అయినప్పటికీ హజ్ యాత్రికుల ద్వారా ఇంకా విదేశీ మారక నిల్వలులో హెచ్చుతగ్గులు ఉండటంతో 'హజ్ రూపీ' ని కూడా ముద్రించింది. ఐతే 1966లో మన కరెన్సీ విలువను తగ్గించడం, గల్ఫ్ దేశాలు ముడి చమురు నిల్వలను కనుగొనడంతో రూపాయి స్థానాన్ని దిర్హామ్ ఆక్రమించింది.

ఈ స్టాంప్ ఇజ్రాయెల్ ప్రభుత్వం భారత సైనికుల వీరత్వానికి జ్ఞాపికగా విడుదల చేసింది. ఐతే భారత సైనికుల వీరత్వంతో ఇజ్రాయెల్ కి ఉన్న సంబంధం అర్ధం చేసుకోవాలంటే మొదటి ప్రపంచ యుద్ధ కాలానికి వెళ్ళాలి.

మొదటి ప్రపంచ యుద్ధం తారాస్థాయి లో ఉన్న నేపధ్యంలో రెండు కూటములూ వ్యూహాత్మక ఓడరేవులు, స్థావరాలపై తమ వశం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని కీలక ప్రాంతాల మీద పట్టు, మొత్తం యుద్ధ ఫలితాలనే ప్రభావితం చేస్తాయి. అలాంటి నగరాల్లో ఇజ్రాయెల్ లో ఉన్న హైఫా నగరం ఒకటి. ఈ నగరానికి ఉన్న రైలు మార్గం మరియు నౌకాశ్రయం వల్ల కీలకమైన వస్తు సరఫరాకి ఇది అనువైన స్థావరం. అందుకే గ్రేట్ బ్రిటన్ మరియు మిత్రరాజ్యాల దళాలు హైఫాను స్వాధీనం చేసుకోవాలని అనుకున్నాయి. హైఫా నగరం 1918 లో జర్మన్-టర్కిష్ దళాల ఆధీనంలో ఉంది.

టర్కిష్ సైన్యం మెషిన్ గన్లు మరియు ఫిరంగిలతో శత్రుదుర్భేద్యంగా ఉంది, మరోవైపు, భారత దళాలు వారి వద్ద బల్లేలు (లేదా లాన్సులు, అందువల్ల 'లాన్సర్స్') మాత్రమే ఉన్నాయి. సంఖ్య పరంగా చూసినా 1500 మంది టర్కీ సైనికులకు వ్యతిరేకంగా 400 మంది మాత్రమే భారతీయ సైనికులు యుద్ధభూమిలో ఉన్నారు. ఆయుధ సంపత్తి మరియు సైనిక సంపదలతేడా ఉన్నప్పటికీ, టర్కీ సైన్యం నుండి హైఫాను స్వాధీనం చేసుకోవడంలో భారత దళాలు విజయవంతమయ్యాయి. హైఫాను బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క 15 వ అశ్వికదళ బ్రిగేడ్ చేజిక్కించుకోవలసి ఉంది, ఇందులో హైదరాబాద్, మైసూర్, పాటియాలా, అల్వార్ మరియు జోధ్పూర్ రాష్ట్రాల నుండి ఇంపీరియల్ సర్వీస్ ట్రూప్స్ ఉన్నారు; దీనిని మొదట ఇంపీరియల్ సర్వీస్ అశ్వికదళ బ్రిగేడ్ అని పిలిచేవారు.23 సెప్టెంబర్ 1918 న, జోధ్పూర్ మరియు మైసూర్ లాన్సర్స్ నేతృత్వంలోని అశ్వికదళ బ్రిగేడ్, అలాగే భవనగర్, బరోడా, ఇదార్ మరియు జామ్నగర్ దళాల బృందం జర్మన్-టర్కిష్ దళాలపై దాడి చేసి హైఫా నగరాన్ని స్వాధీనం చేసుకుంది.

అలాగే వారు బ్రిటిష్ సామ్రాజ్యం కింద పోరాడినప్పటికీ, ఇజ్రాయెల్ ప్రజలు, భారత సైనికుల సహకారాన్ని, పోరాట పటిమను ప్రత్యేకంగా గమనించారు. హైఫా యుద్ధానికి సంబంధించిన అధికారిక చరిత్ర మాటల్లో చెప్పాలంటే “ఆ వ్యూహాత్మక నగరాలను స్వాధీనపరుచుకొనే ప్రయత్నం మొత్తంలో, హైఫా నగర ముట్టడికన్నా గొప్ప అశ్వికదళ చర్య ఏదీ జరగలేదు… బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న మెషిన్ గన్లు కూడా సమరోత్సాహంతో దూకుతున్న ఆ గుర్రాలను ఆపడంలో విఫలమయ్యాయి. కానీ వారిలో చాలామంది గాయాలతో మరణించారు." ఆ రోజు ఇజ్రాయెల్ కోసం పోరాడిన 400 మంది భారతీయ సైనికులను ఇజ్రాయెల్లోనే ఖననం చేశారు. కెప్టెన్ అమర్ సింగ్ బహదూర్, దఫదర్ జోర్ సింగ్, మేజర్ దల్పత్ సింగ్, కెప్టెన్ అనోప్ సింగ్ మరియు 2 వ లెఫ్టినెంట్ సాగత్ సింగ్ వారిలో ఉన్నారు. హైఫా నగరం లో, 3 నుండి 5 తరగతుల వరకు పాఠశాల సిలబస్‌లో జర్మన్-టర్కిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన భారత సైనికుల చరిత్రను ఇప్పుడొక అధ్యాయం.

మన ఇప్పటి జాతీయ జండా ఎవరు రూపకల్పన చేసారు?
పింగళి వెంకన్న మీ సమాధానం ఐతే ఈ వివరణ చదవండి
మరో రెండు నెలల్లో భారతదేశం స్వతంత్రంగా ఉండబోతోందని తెలిసాక రాజ్యాంగ సభ ముందున్నా ప్రధాన లక్ష్యాలు రెండు: దేశంలోని అన్ని వర్గాలను సంతృప్తి పరిచే జాతీయ చిహ్నం మరియూ జాతీయ ఝండాను భారత సంవిధానపరంగా అధికారికంగా ఆమోదించడం. అప్పటికే పింగళి వెంకయ్య రూపొందించిన స్వరాజ్య ఝండా (1931 కాంగ్రెస్ మహాసభలో కాంగ్రెస్ పార్టీ ఝండాగా ఆమోదించబడిన, చరఖాతో ఉండే త్రివర్ణ పతాకం) విరివిగా వాడబడుతున్నప్పటికీ అది పార్టీ ఝండా మాత్రమే. మౌంట్బాటన్ ప్రతిపాదించిన మరొక ఝండాను తిరస్కరించారు. అప్పుడే నెహ్రు ఆ పనిని రాజ్యాంగ సభలో ఒక ముఖ్యమైన పౌర సేవకుడైన బదర్-ఉద్-దిన్ ఫైజ్ త్యాబ్జీకి అప్పగించారు. త్యాబ్జీ, రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ఒక ఫ్లాగ్ కమిటీని ఏర్పాటు చేసి, అన్ని కళల విద్యాలయాలకు, పాఠశాలలకు డిజైన్లను సిద్ధం చేయాలని లేఖలు పంపారు. కానీ అన్ని డిజైన్లలో ఏదో విధంగా బ్రిటిష్ డిజైన్లను ప్రతిబింబించడం, భారతీయ అస్తిత్వపు ఆనవాళ్ళు లేకపోవడం వారిని నిరాశపరచింది. అప్పుడే త్యాబ్జీ మరియు అయన భార్య సురయ్య , అన్ని మతాలను, వర్గాలను ఆకట్టుకున్న అశోక చక్రవర్తి చిహ్నాన్ని తెర పైకి తెచ్చారు. అప్పుడప్పుడే చెలరేగుతున్న మాట విద్వేషాలకు వ్యతిరేకంగా, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే లక్షణం ఉన్న అశోక చిహ్నం దేశ చిహ్నంగా ప్రతిపాదించబడింది. ఇక జాతీయ ఝండా కూడా స్వరాజ్య ఝండాలో చరఖా స్థానంలో అశోక చిహ్నం నుండి ధర్మ చక్రాన్ని ఉంచే విధంగా ప్రతిపాదన చేసారు త్యాబ్జీ దంపతులు. ఇవి తర్వాత ఆమోదాన్ని పొందాయి కావున ప్రస్తుత జాతీయ ఝండా రూపకర్తలు పింగళి వెంకయ్య తో పాటు ట్యాబుజి దంపతులు కూడా అని చెప్పడం ఎంతైనా సమంజసం.

     
 
what is notes.io
 

Notes.io is a web-based application for taking notes. You can take your notes and share with others people. If you like taking long notes, notes.io is designed for you. To date, over 8,000,000,000 notes created and continuing...

With notes.io;

  • * You can take a note from anywhere and any device with internet connection.
  • * You can share the notes in social platforms (YouTube, Facebook, Twitter, instagram etc.).
  • * You can quickly share your contents without website, blog and e-mail.
  • * You don't need to create any Account to share a note. As you wish you can use quick, easy and best shortened notes with sms, websites, e-mail, or messaging services (WhatsApp, iMessage, Telegram, Signal).
  • * Notes.io has fabulous infrastructure design for a short link and allows you to share the note as an easy and understandable link.

Fast: Notes.io is built for speed and performance. You can take a notes quickly and browse your archive.

Easy: Notes.io doesn’t require installation. Just write and share note!

Short: Notes.io’s url just 8 character. You’ll get shorten link of your note when you want to share. (Ex: notes.io/q )

Free: Notes.io works for 12 years and has been free since the day it was started.


You immediately create your first note and start sharing with the ones you wish. If you want to contact us, you can use the following communication channels;


Email: [email protected]

Twitter: http://twitter.com/notesio

Instagram: http://instagram.com/notes.io

Facebook: http://facebook.com/notesio



Regards;
Notes.io Team

     
 
Shortened Note Link
 
 
Looding Image
 
     
 
Long File
 
 

For written notes was greater than 18KB Unable to shorten.

To be smaller than 18KB, please organize your notes, or sign in.